News
ముఖ్యమంత్రి పూర్తిగా కోలుకున్నారు
సీఎండీ ప్రతాప్ సి.రెడ్డి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని అపోలో హాస్పిటల్స్ తెలిపారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘ జయలలిత పూర్తిగా కోలుకున్నారు. ఆమెకు ఏం కావాలో అడుగుతున్నారు. తన చుట్టూ ఏం జరుగుతుందనే విషయాలు తెలుసుకుంటున్నారు. ఎప్పుడు ఇంటికి వెళ్లాలనే దానిపై ఆమే నిర్ణయం తీసుకుంటారు’ అని ప్రతాప్ సి.రెడ్డి వెల్లడించారు. తీవ్ర జ్వరం కారణంగా జయలలిత సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచీ ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆమెకు వైద్యం అందిస్తున్నారు. జయలలిత కోలుకున్నారని. త్వరలోనే ఇంటికి తిరిగి వస్తారని అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి. క్రిటకల్ కేర్ విభాగం నుంచి సాధారణ గదికి త్వరలోనే మార్చనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








